చంద్రబాబు ఆరోగ్యం కోసం నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు

  • రాజమండ్రిలో వినాయకుడి ఆలయానికి వెళ్లిన చంద్రబాబు ఫ్యామిలీ
  • ఆమె వెంట బాలకృష్ణ సతీమణి వసుందర ఇతర కుటుంబ సభ్యులు
  • పూజలు పూర్తయ్యాక క్యాంప్ సైట్ కు తిరిగి వెళ్లిన నారా భువనేశ్వరి
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని ఆయన సతీమణి నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం రాజమండ్రిలోని శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి ఆలయానికి నారా భువనేశ్వరి తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. రాజమండ్రి నాళం భీమరాజు వీధిలోని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భువనేశ్వరి వెంట సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర కూడా ఉన్నారు.

ఆలయంలో పూజల అనంతరం వారు తిరిగి క్యాంప్ సైట్ కు చేరుకున్నారు. మధ్యాహ్నం నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలతో పాటు ఏపీ ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు చంద్రబాబుతో భేటీ కోసం సెంట్రల్ జైలుకు వెళ్లారు. మిలాఖత్ లో ఈ ముగ్గురూ చంద్రబాబును కలుసుకుని మాట్లాడారు.

Nara Bhuvaneswari
Rajamundri Temple
Temple

More Telugu News